తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం బార్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జే. శ్రీనివాస్ రావు కు బార్ అసోసియేషన్ తరఫున వివిధ అభ్యర్థనలతో కూడిన వినతిపత్రం సమర్పించబడింది. సమావేశానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని బార్ కార్యవర్గం తరఫున చిరు సత్కారం చేశారు. వినతిపత్రంలో ప్రతిపాదించిన ముఖ్యమైన అంశాలు: 1️⃣ SC/ST (Prevention of Atrocities) కేసుల కొరకు ప్రత్యేక న్యాయస్థానం స్థాపన 2️⃣ కుటుంబ న్యాయస్థానం (Family Court) స్థాపన 3️⃣ జువెనైల్ జస్టిస్ బోర్డు/కోర్టు స్థాపన 4️⃣ అన్ని కోర్టుల్లో తగిన న్యాయ సిబ్బందిని నియమించడం 5️⃣ కొత్త కోర్టు సముదాయం (Court Complex) నిర్మాణం ప్రారంభించడం 6️⃣ ఏజెన్సీ కోర్టులకు రెగ్యులర్ జడ్జిని నియమించాలన్న అభ్యర్థన 7️⃣ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (Consumer Court) స్థాపన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి పి. వసంత్, అదనపు జిల్లా జడ్జి సరిత, సీనియర్ జడ్జిలు ఎం. రాజేందర్, కే. కిరణ్ కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, K. కవిత, జూనియర్ జడ్జిలు కే. సాయి శ్రీ, బి. రవికుమార్, వి. శివ నాయక్,D. కీర్తి చంద్రికా రెడ్డి,B. భవాని, K. సూరెడ్డి పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ తరఫున ఉపాధ్యక్షుడు జే. గోపికృష్ణ, ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, సహాయ కార్యదర్శి కాసాని రమేష్, కార్యవర్గ సభ్యులు ఉప్పు అరుణ్, అడపాల పార్వతి, మాలోత్ ప్రసాద్, కె. చిన్నికృష్ణతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సమావేశం విజయవంతంగా ముగిసి, న్యాయ వ్యవస్థ అభివృద్ధి దిశగా బార్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి
Admin
తెలుగు వెలుగు టీవీ