తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బి ఎల్ ఓ, బి ఎల్ ఏ లకు సహకరించండి 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపు దేశవ్యాప్తంగా జరుగుతున్న (ఎస్ ఐ ఆర్) ప్రత్యేక ఓటర్ సవరణ సర్వే పురస్కరించుకొని సర్వేలో మన ఇంటి ముందుకు వచ్చే బిఎల్ఓ,బి ఎల్ ఏ లకు ఓటర్లు సహకరించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం నియోజకవర్గం లోని రామవరం లో 182వ బూతు బిఎల్ఓ బిఎల్ఎ లు ఇంటింటికి తిరిగి సంబంధిత పత్రాలను పంచే కార్యక్రమం లో కార్పొరేటర్ మునిగడప పద్మ పాల్గొని మాట్లాడుతూ సర్వేలో ఓటర్లు అప్రమత్తంగా ఉండి తమ ఓటును కాపాడుకోవాలని, మన ఇంటికి వచ్చే బీఎల్ఓ లకు వారు అడిగిన సమాచారాన్ని ఇచ్చి మీకు ఇచ్చిన ఫారం ను పూర్తి చేసి మరల బిఎల్ఓ కు ఇచ్చేంతవరకు సహకరించాలని ఆమె తెలిపారు. 25 నుండి జూలై 24 వరకు ఈ సవరణ సర్వే జరుగుతుందని దీనిలో కొత్త ఓటర్లను చేర్చుకోవడం, చనిపోయిన ఓటర్లను తొలగించడం ,ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్న ఓట్ల లో అదనపు ఓటును తొలగించడం మన ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులను సరి చేసుకోవడం చేస్తారని ఆమె తెలిపారు. దరఖాస్తును పూర్తిచేసే సందర్భంలో మనకు అర్థం కానట్లయితే బి ఎల్ ఎ ల సహాయం తీసుకొని, మీకు ఇచ్చిన పారాలను పూర్తి చేసి బిఎల్ఓ లకు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ శివరాం ,సిపిఐ జిల్లా నాయకులు మునిగడప పద్మ వెంకటేశ్వర్లు, సిపిఐ 182 వ బూతు లెవల్ బిఎల్ఎ జావిద్ పాష, టిఆర్ఎస్ బి ఎల్ ఏ అంజుమ్ నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ