తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశం మొత్తం కులగనన తో కూడిన జనాభా లెక్కలు చేస్తున్నట్లుగా ప్రకటించిన కేంద్ర క్యాబినెట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో బస్టాండ్ అమరవీరుల స్థూపం వద్ద నుండి భారీ ర్యాలీగా పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ఈ దేశంలో ఎవరి వాటా ఎంత అని తేల్చేది భారతీయ జనతా పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసపూరిత లెక్కల వలె భారత దేశ కుల గణన ఉండదని ఈ సందర్భంగా అన్నారు ఈ శుభ పరిణామాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైడిపాటి రవీందర్, పార్లమెంట్ కో కన్వీనర్ జల్లారపు శ్రీను, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలచెరువు శ్రీను, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సలీం, కొత్తగూడెం మాజీ పట్టణ అధ్యక్షుడు జీవీకే శివ, కొత్తగూడెం పట్టణ మహిళా అధ్యక్షురాలు గూడ విజయ, పూర్ణ, సత్యభామ, కొత్తగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్పెద్ది రెడ్డి. గోపి, జoపన్న, కళ్యాణ్,బలగం, శ్రీధర్, యాదగిరి, అరుణ్, భవాని ప్రసాద్, మరియు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ