తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్ నందు కొత్తగూడెం ఏరియా జిఎం శాలెం రాజు ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న గుర్తింపు సంఘం ఏఐటియుసి సహాయ కార్యదర్శి జె.గట్టయ్య బుధవారం ఉదయం డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్ నందు దివ్యాంగులకు జిఎం శాలెం రాజు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గుర్తింపు సంఘం ఏఐటియుసి సహాయ కార్యదర్శి జె.గట్టయ్య మాట్లాడుతూ దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలి విద్య, ఉద్యోగం, క్రీడలు, మరియు ఇతర సామాజిక కార్యకలాపాలలో దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం అని అన్నారు, అదేవిధంగా దివ్యాంగుల పట్ల ఉన్న అపోహలను, భయాలను తొలగించి, వారిని సమాజంలో ఒక భాగంగా అంగీకరించేలా ప్రజలలో అవగాహన పెంచాలి,మరియు దివ్యాంగులు తమకున్న పరిమితులను అధిగమించి, ఎన్నో విజయాలు సాధించగలరని,వారికి ఆత్మవిశ్వాసం కల్పించి, ప్రోత్సహించాలి. ఈ కార్యక్రమం లో కార్పొరేట్ జిఎం పర్సనల్ కిరణ్ కుమార్,సేవ కమిటీ అధ్యక్షురాలు మధురవాణి,తాతిదారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ