Sunday, 07 June 2026 08:46:34 AM
# బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సొప్పరి క్రాంతి ఆధ్వర్యంలో గౌతంపూర్ లో మొక్కలు నాటడం జరిగినది. # ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు ఎఐటీయూసీ సెంట్రల్ కౌన్సిల్ సమావేశం. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి. # మున్సిపల్ కార్పొరేషన్‌లో సిపిఐ పక్ష బలాన్ని సమర్థవంతంగా చాటాలి.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు # నామా వినోద్‌పై దాడి చేసిన భూకబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. # మీసేవ దరఖాస్తుల పరిశీలన పూర్తిగా ఆన్‌లైన్‌లోనే. జీపీఓలు, ఆర్‌ఐలకు అవగాహన కల్పించిన ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు. # ప్రజల ప్రాణ రక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలి. గోదావరి వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # మరో రెండు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్న నేపథ్యంలో జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. # భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప కాలనీ, రెవిన్యూ కాలనీల్లో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. # విద్యార్థులు సాంస్కృతిక పోటీల్లో రాణించాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మాస్టర్ ఈ .కె ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కాకర్ల గ్రామం నందు ఉచిత హోమియో వైద్య శిబిరం. # భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ పార్కులో ప్లాస్టిక్ ఏరివేత -మొక్కలు నాటిన ఎస్ జి ఎఫ్. # కొత్తగూడెం ఇల్లందు రహదారిపై స్కూటీని ఢీకొన్న లారీ. # పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ధరల పెరుగుదలపై రాజీలేని పోరాటం చేద్దాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # గోపన్నగూడెంలో మినీ మేడారం జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె. # జనగణన జాబితా వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # సమున్నత ఆశయాలతోనే భారత జాతీయ మహిళా సమాఖ్య ఆవిర్భావం. భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి. # ప్రజా సమస్యల పరిష్కార మార్గాన్ని చూపే విధంగా గ్రామ సభలు ఉండాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పోషణ అభియాన్ అద్భుత పథకం. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి.

Date : 16 February 2026 08:44 PM Views : 424

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం. స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్ మరియు న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద "ఇందిరమ్మ అమృతం" పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ప్రతినెల షెడ్యూల్ ప్రకారం అంగనవాడి పర్యవేక్షకురాలు (సూపర్వైజర్) తమ సెక్టార్ యొక్క అంగన్వాడీ కేంద్రాల సందర్శించి రాష్ట్ర పోర్టల్ ఎం ఎం అంగనవాడిలో వివరాలను నింపాలని, పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్డ్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :