Saturday, 19 September 2026 09:52:35 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

పోషణ అభియాన్ అద్భుత పథకం. రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి.

Date : 16 February 2026 08:44 PM Views : 493

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగనవాడి అధికారులతో సమీక్ష సమావేశం. స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందుగల సమావేశ మందిరంలో మహిళా, శిశు, వయోవృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని జె. స్వర్ణలత లెనీనా ఆధ్వర్యంలో వరంగల్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ప్రతి ఒక్క అంగనవాడి కేంద్రం తెరవాలని, తెరిచిన వెంటనే టీచర్, హెల్పర్, లబ్ధిదారుల హాజరు కేంద్ర రాష్ట్ర స్థాయి అప్లికేషన్లు అయినటువంటి పోషణ ట్రాకర్ మరియు న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టంలో నమోదు చేయాలని తెలిపారు. వైద్యశాఖ సమన్వయంతో అతి తీవ్ర పోషణ లోపం, పోషణ లోపం, తక్కువ బరువుతో ఉన్న పిల్లలను ప్రత్యేకంగా పర్యవేక్షించి వైద్యుల సూచనల మేరకు న్యూట్రిషన్ రీహబిటేషన్ సెంటర్కి పంపించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రతినెల క్రమం తప్పకుండా అత్యాధునిక సాంకేతిక పరికారాలతో పిల్లల ఎత్తు, బరువులు చూసి సరైన సమయంలో సరైన పోషణ అందించాలని కోరారు. కిశోర బాలికల కోసం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద "ఇందిరమ్మ అమృతం" పేరుతో 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల ఆడపిల్లలకు మిల్లెట్స్ తో కూడిన చిక్కిలు నెల నెల అందజేయడం జరుగుతుందని తద్వారా రక్తహీనత లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడమే మన లక్ష్యం అన్నారు, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎవరైనా గుత్తేదారులు పంపిణీ విషయంలో కానీ నాణ్యత విషయంలో గానీ అలసత్వం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ప్రతినెల షెడ్యూల్ ప్రకారం అంగనవాడి పర్యవేక్షకురాలు (సూపర్వైజర్) తమ సెక్టార్ యొక్క అంగన్వాడీ కేంద్రాల సందర్శించి రాష్ట్ర పోర్టల్ ఎం ఎం అంగనవాడిలో వివరాలను నింపాలని, పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార విలువలపై టీచర్లకు అవగాహన కల్పిస్తూ, పోషణ అభియాన్ పథకంలో భాగంగా తల్లుల కమిటీ, గ్రామస్తులు, గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సామూహిక వేడుకలు అయినటువంటి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, శ్రీమంతాలు నిర్వహిస్తూ వారిలో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తనదైన శైలిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని శాశ్వతంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించేందుకు గాను పెరటి తోట పెంపకాలు (న్యూట్రి గార్డెన్స్) నిర్మించారని దీనిని ఆదర్శంగా తీసుకొని వివిధ జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జే. స్వర్ణలత లెనీనా, జిల్లా సిడిపివోలు ప్రసన్న లక్ష్మి, జయలక్ష్మి, తార, అరుణ కుమారి, పద్మశ్రీ, చైతన్య, సలోమి, హేమ సత్య, జ్యోతి, జిల్లా పోషణ అభియాన్ కోఆర్డినేటర్ పొనుగోటి సంపత్, జిల్లా కార్యాలయ సిబ్బంది హసీనా, భార్గవి, డి. సి .పి .ఓ హరికుమారి, చైల్డ్ లైన్ సందీప్, జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :