తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నుండి 31వ తారీకు వరకు జరిగే కార్యక్రమాలను నిర్వహించడంలో భాగంగా ఈ రోజు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ ను ఏర్పాటు చేయడం జరిగింది.కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,కొత్తగూడెం వన్టౌన్ సిఐ కరుణాకర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.ఈ ఆన్లైన్ ఓపెన్ హౌస్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు పోలీస్ శాఖలో వినియోగిస్తున్న ఆయుధాలు,బాంబు డిస్పోజల్ సామాగ్రి,పోలీస్ జాగిలాల ప్రదర్శనతో పాటు వాటి వినియోగం గురించి కూడా వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు విద్యార్థులు కూడా పాల్గొని ప్రత్యక్షంగా ఈ ఓపెన్ హౌస్ ను వీక్షించారు.ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి గారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ చేస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరు ప్రజలకు,విద్యార్థినీ,విద్యార్థులకు తెలిసే విధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం పోలీస్ శాఖ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ