తెలుగు వెలుగు టీవీ - వార్తలు / లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్న శ్రీ సమ్మక్క- సారలమ్మల గద్దెలను ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, వసుంధర షాపింగ్ మాల్ అధినేత తాటిపల్లి శంకర్ బాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తాటిపల్లి రాజేశ్వరి దంపతులు శనివారం దర్శించుకున్నారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం మొక్కులు చెల్లించుకున్నారు. అమెరికాలో ఉన్న తమ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా అమ్మవార్ల దర్శనం కల్పించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన లక్ష్మీదేవిపల్లి లోని శ్రీ సమ్మక్క- సారలమ్మ ల గద్దెలను దర్శించుకోవటం, పూజలు చేయడం అమ్మవారి కృపకు పాత్రులు కావటం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఈ సందర్భంగా వారు చెప్పారు. జాతర కార్య నిర్వాహకులు గుడిపూడి ఆదిలక్ష్మి, కాంతమ్మ, రమాదేవిలు వారికి స్వాగతం పలికి,ఆదివాసీల సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ