తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎరగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కమ్యూనిటీ ఆరోగ్య అధికారి బాజీ పరమేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు డెంగ్యూపై అవగాహన కల్పించారు. “తనని చేయండి.. శుభ్రపరచండి.. దోమని ఉండనివ్వండి” అనే నినాదంతో ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాత టైర్లు, కూలర్లు, డబ్బాలు వంటి వాటిలో దోమలు పెరగకుండా చూడాలని తెలిపారు. డెంగ్యూ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, సకాలంలో మందులు వాడుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు.గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని డెంగ్యూ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆరోగ్య సిబ్బంది పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఒకరోజు డ్రై డే పాటించి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆరోగ్య పర్యవేక్షకుడు ప్రకాష్, నర్సింగ్ అధికారి సత్యవతి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ