తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆపదలో అభయహస్తం.మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణపై అవగాహన కల్పించేందుకు గురువారం ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్లో షీ టీమ్–భరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ రమాదేవి పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.రాగింగ్, టీజింగ్, బ్లాక్మెయిలింగ్, అసభ్యకర మెసేజ్లు, తప్పుడు ఫోన్ కాల్స్, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు వంటి ఘటనలు ఎదురైనప్పుడు భయపడకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. షీ టీమ్స్ మహిళలు, బాలికలకు అండగా ఉంటాయని, బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.పోలీస్ స్టేషన్కు వెళ్లేందుకు ఇబ్బంది పడేవారి వద్దకే షీ టీమ్స్ చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ఫోన్, వాట్సాప్ తదితర మార్గాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం తదితర చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని ఎస్ఐ రమాదేవి సూచించారు. కార్యక్రమంలో భరోసా కో ఆర్డినేటర్ సుమలత,ASI కస్తూరి, PC రాంబాబు,పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ