తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణను గుర్తింపు కార్మిక సంఘం ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమీ రాజ్కుమార్లు మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధి, ఉత్పత్తి–ఉత్పాదకత పెంపు, కార్మికుల సంక్షేమం అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ తమ సంఘం దశాబ్దాలుగా నిరంతర ఉద్యమాలు, పోరాటాలు, యాజమాన్యంతో నిర్మాణాత్మక చర్చల ద్వారా అనేక సమస్యలకు పరిష్కారాలు సాధించిందని తెలిపారు. కొత్తగూడెం ఏరియాను ఉత్పత్తి, ఉత్పాదకతలో అగ్రస్థానంలో నిలిపే సమర్థ అధికారిగా వెంకటరమణ రాణించాలని ఆకాంక్షించారు.అలాగే కార్మికుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, సంక్షేమ పథకాల అమలుకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఏరియాలో కార్మికులకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో యాజమాన్యం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శులు సారయ్య, ముస్కే సమ్మయ్య, మడ్డి ఎల్లగౌడ్, వై.వి.రావు, కందికట్ల వీరభద్రయ్య, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, ఉపాధ్యక్షుడు కత్తర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్ సందబోయిన శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ