తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గోవు పర్యావరణ పరిరక్షణలో శాస్త్రీయ విజ్ఞానం గోవిజ్ఞాన పరీక్షలు రాష్ట్రస్థాయి అర్హత కోసం జిల్లాస్థాయిలో విద్యార్థులకు రామవరం స్వర్ణ భారతి ఉన్నత పాఠశాల యందు గో సేవ విభాగం తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యులు కేవై స్వామి నాయుడు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ రైతు యొక్క హలం ఆవు యొక్క ఫలం దేశాభివృద్ధికి మూల స్తంభాలు అందుకే ఆవును రక్షించుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేశారు జిల్లాస్థాయి పరీక్షల కోసం జిల్లాలోని వివిధ పాఠశాలలో మొదట 12 వేల మంది విద్యార్థిని విద్యార్థులతో పరీక్షలు నిర్వహించి అందులో నుండి 450 మందిని ఎంపిక చేసి జిల్లా స్థాయి పరీక్షలు రాయించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పంచగవ్య వైద్యులు శైలజ గో సేవ కార్యకర్తలు రామచంద్ర రావు, రాజేశ్వరరావు, చైతన్య కిషోర్, డాక్టర్ త్రిపాల్, సతీష్ ఖండేల్వాల్, పుణ్యానాయక్ , నాగచైతన్య మరియు పట్టణ గోహసేవ ప్రముఖ కుసుమ వెంకటేష్ పాల్గొనడం జరిగినది
Admin
తెలుగు వెలుగు టీవీ