Monday, 03 August 2026 09:12:20 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలి : జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్.

Date : 20 January 2026 07:27 PM Views : 199

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగబోయే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ అన్నారు. ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఆర్‌ఓలు , ఏఆర్‌ఓలు కు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె. శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఆర్‌ఓలు, ఏఆర్‌ఓల విధులు, బాధ్యతలను విస్తృతంగా వివరించారు. నోటీసుల జారీ నుంచి ప్రారంభించి నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన , పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం, ఎన్నికల గుర్తుల కేటాయింపు విధానం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్ స్టేషన్ల పరిశీలన, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.ఎన్నికల నిర్వహణలో పూర్తి అవగాహన కలిగి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులు సూచించారు.మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఉపయోగించే ఫారాలపై, ముఖ్యంగా నామినేషన్ ఫారాల భర్తీ విధానం, జాగ్రత్తలు తదితర అంశాలను ట్రైనింగ్ అడిషనల్ నోడల్ అధికారి పి. సాయి కృష్ణ వివరించారు. అలాగే, గత ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎంపీడీవో శ్రీనివాస్ వివరించారు.శిక్షణలో ప్రత్యేకంగా, బ్యాలెట్ పేపర్లు మరియు పోలింగ్ బాక్స్‌ల ద్వారా నిర్వహించే పురపాలక ఎన్నికల సమయంలో ప్రిసైడింగ్ అధికారులు తమ విధుల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, వార్డుల వారీ పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పర్యవేక్షించి ఎన్నికల ప్రతి దశను నియమాలకు అనుగుణంగా నిర్వహించవలసిన విధానాన్ని అధికారులు హైలైట్ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, పాటు సుమారు 200 మంది ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :