తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : త్వరలో జరగబోయే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ అన్నారు. ఎన్నికలను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు గాను ఆర్ఓలు , ఏఆర్ఓలు కు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి కె. శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఆర్ఓలు, ఏఆర్ఓల విధులు, బాధ్యతలను విస్తృతంగా వివరించారు. నోటీసుల జారీ నుంచి ప్రారంభించి నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన , పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడం, ఎన్నికల గుర్తుల కేటాయింపు విధానం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, పోలింగ్ స్టేషన్ల పరిశీలన, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు.ఎన్నికల నిర్వహణలో పూర్తి అవగాహన కలిగి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులు సూచించారు.మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఉపయోగించే ఫారాలపై, ముఖ్యంగా నామినేషన్ ఫారాల భర్తీ విధానం, జాగ్రత్తలు తదితర అంశాలను ట్రైనింగ్ అడిషనల్ నోడల్ అధికారి పి. సాయి కృష్ణ వివరించారు. అలాగే, గత ఎన్నికల సమయంలో ఎదురైన అనుభవాలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఎంపీడీవో శ్రీనివాస్ వివరించారు.శిక్షణలో ప్రత్యేకంగా, బ్యాలెట్ పేపర్లు మరియు పోలింగ్ బాక్స్ల ద్వారా నిర్వహించే పురపాలక ఎన్నికల సమయంలో ప్రిసైడింగ్ అధికారులు తమ విధుల్లో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని, వార్డుల వారీ పోలింగ్ కేంద్రాలను సమగ్రంగా పర్యవేక్షించి ఎన్నికల ప్రతి దశను నియమాలకు అనుగుణంగా నిర్వహించవలసిన విధానాన్ని అధికారులు హైలైట్ చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, పాటు సుమారు 200 మంది ఆర్ఓలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ