తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై సమగ్ర సమీక్ష కోసం బుధవారం దిశా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 11.00 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు . ముందుగా ఈ సమావేశాన్ని మధ్యాహ్నం 3.00 గంటలకు నిర్వహించాలని నిర్ణయించగా, పరిపాలనా కారణాల వల్ల సమయాన్ని సవరించి ఉదయం 11.00 గంటలకు మార్చినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు, సభ్యులు ఈ మార్పును గమనించి సమయానికి హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశం ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామ రెడ్డి అధ్యక్షతన జరగనుండగా, కో-చైర్మన్గా మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ పాల్గొననున్నారు. శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మున్సిపల్ మేయర్స్ , దిశా కమిటీ సభ్యులు, సంబంధిత అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతి, నిధుల వినియోగం, లక్ష్యాల సాధన, లబ్ధిదారులకు అందుతున్న సేవలపై విస్తృతంగా చర్చించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు తమకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతి నివేదికలు, వివరాలతో సమావేశానికి సిద్ధంగా హాజరు కావాలని ఆదేశించారు
Admin
తెలుగు వెలుగు టీవీ