తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం సభ్యులతో స్ట్రక్చర్ కమిటీ సమావేశాలు వేరు వేరు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం యొక్క స్ట్రక్చర్ కమిటీ సభ్యులు అందజేసిన డిమాండ్లను జిఎం కమిటీ సమావేశంలో హాజరైనటువంటి సంబంధిత అధికారులతో చర్చించి వారి డిమాండ్ల యొక్క అమలుకు సాధ్య సాధ్యలను పరిశీలించి ఏరియా పరిధిలో పరిష్కరించదగిన డిమాండ్లను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిఎం తో పాటు గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తో ఏర్పాటు చేసిన స్ట్రక్చర్ కమిటీ నందు కొత్తగూడెం ఏరియా అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ జె గట్టయ్య, సత్తుపల్లి ఏరియా ప్రతినిధి సముద్రాల సుధాకర్, స్ట్రక్చర్ కమిటీ మెంబర్ ఉమాయిన్ పాల్గొన్నారు. ప్రాతినిధ్య సంఘం ఐఎన్టియుసి స్ట్రక్చర్ కమిటీ నందు వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి. నాగరాజు, స్ట్రక్చర్ కమిటీ మెంబర్ జి. సీత రామరాజు పాల్గొన్నారు. యాజమాన్య ప్రతినిధులుగా ఎస్ఓటు జిఎం జివి.కోటిరెడ్డి, డిజిఎం(పర్సనల్) జి.వి. మోహన్ రావు, జీకే ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.శ్రీ రమేష్, జెవిఆర్ ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్.వి.ఆర్ ప్రహ్లాద్, కిష్టారం ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వీ.నరసింహారావు, డిజిఎం (ఐఈడి) ఎన్. యోహన్, డిజిఎం (ఈ & ఎం) ఏరియా వర్క్ షాప్ టి శ్రీకాంత్, ఏరియా స్టోర్స్ ఇంచార్జ్ లక్షణమూర్తి, ఇంచార్జ్ ఆర్.సి. హెచ్.పి ఎస్.కే.కరీముల్లా, డివైఎస్ఈ(సివిల్) అచ్యుతరామయ్య, మెడికల్ సూపర్డెంట్ ఎం.పరశురాములు, ఏరియా స్టేట్స్ ఆఫీసర్ బి.తౌరియా, డివైపిఎం (పర్సనల్) గోవర్ధన హరీష్, సీనియర్ పిఓలు కె. దేవదాస్, అధికారులు డి కావ్య, కే.శ్రీనివాస్ పాల్గొన్నారు. అధికార ప్రతినిధి, కొత్తగూడెం ఏరియా.
Admin
తెలుగు వెలుగు టీవీ