Sunday, 02 August 2026 09:32:15 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

గృహ నిర్మాణ శాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ అంకిత్ సమీక్ష.

Date : 12 March 2026 08:09 PM Views : 286

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో అమలు జరుగుతున్న గృహ నిర్మాణ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో మంజూరైన ఇళ్ల సంఖ్య, ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్ల వివరాలు, స్లాబ్ లెవల్‌కు చేరుకున్న ఇళ్ల స్థితి, ఇంకా నిర్మాణం ప్రారంభం కాని లేదా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం అయ్యేలా అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రౌండింగ్ పూర్తైన ఇళ్లను త్వరితగతిన తదుపరి దశలకు తీసుకెళ్లి స్లాబ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.జిల్లాలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పురోగతిపై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.మిగిలిన ఇళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే లక్ష్యమని, అందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు .సమాసంలో హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ ఏఈలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :