తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు ఆగస్టు 29 (తెలుగు వెలుగు)బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2న ప్రారంభం అవుతున్నది, బిజెపి ప్రపంచంలో కల్లా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా గతంలోనే నమోదైనది నీతి నిజాయితీగా ఉండే బిజెపి పార్టీలో చేరడానికి ప్రజలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని ప్రతి పోలింగ్ బూతులు 200 మంది సభ్యులు కంటే ఎక్కువగా సభ్యత నమోదు చేయాలని అన్నారు, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆగస్టు 15 లోపు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని ఈరోజు వరకు కూడా మాఫీ చేయకుండా రేషన్ కార్డు లేకపోతే యాప్ లో కుటుంబ నిర్ధారణ చేసుకోవాలని , రెండు లక్షల దాటిన రైతులందరూ కూడా పై డబ్బులు కడితేనే ఇస్తామని, రైతులను ఇబ్బంది పెడుతున్నారని , పెట్టుబడి సాయం రైతులకు ఎకరానికి 15000 రూపాయలు జూన్ నెలలో ఇవ్వాల్సింది ఆగస్టు నెల కూడా అయిపోతుందని, గారడి మాటలతో ప్రజల్ని మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, జిల్లా నాయకులు నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల కార్యదర్శి భూక్య రమేష్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, నర్వ నేని కృష్ణ, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ