తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ నెల 27,28 తారీఖులలో భద్రాచలంలో జరగనున్న శ్రీరామనవమి,పట్టాభిషేక మహోత్సవానికి ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఇందులో భాగంగానే పార్కింగ్ స్థలాలు,కళ్యాణ మంటపం,సెక్టార్లు మరియు లడ్డూ,తలంబ్రాల కౌంటర్ల వద్దకు భక్తులు సులభంగా కనుగొని అక్కడికి చేరుకునే విధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక QR కోడ్ ను మరియు ఆన్లైన్ లింకును రూపొందించడం జరిగిందని తెలిపారు. https://ramanavami.4sightai.com/ ఆన్లైన్ లింకు ద్వారా రామనవమి మరియు పట్టాభిషేక మహోత్సవ తేదీలలో భద్రాచలంలో భక్తులు సులభంగా వారు చేరుకోవాల్సిన స్థలాలకు చేరుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా సుమారుగా 2000 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరుగుతుందని తెలిపారు.కావున భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు వారికి సహకరించగలరని కోరారు.అదే విధంగా ఆ రెండు రోజులు పాటు భక్తులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు వారు విధించే ఆంక్షలకు భద్రాచలం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ