Saturday, 19 September 2026 05:55:03 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

సింగరేణి ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

Date : 23 August 2024 05:21 PM Views : 918

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో ఇటీవల బదిలీపై వచ్చిన తెలుగు ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై నేపథ్యంలో అతడిపై సస్పెన్షన్ వేటు వేస్తూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉపాధ్యాయుడు పోలీసుల అదుపులో ఉన్నారని, తక్షణమే ఇతనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని జనరల్ మేనేజర్(ఎడ్యుకేషన్) బి.నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ తర్వాత ఆరోపణలు రుజువైతే తీవ్ర చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తి భరోసా ఇస్తున్నామని, అలాగే ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. సత్ప్రవర్తన లేని ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విద్యార్థుల భద్రతకు యాజమాన్యం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఈరోజు ఆందోళన చేశారు దీంతో వన్ టౌన్ పోలీసులు వేణుని అదుపులోకి తీసుకున్నారు అతనిపై కేసు నమోదు చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :