Sunday, 02 August 2026 07:41:39 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

రైతులకు ఇబ్బందులు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేపడుతున్నాం - జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 19 May 2026 08:16 PM Views : 178

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, హమాలీ, రవాణా తదితర ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు . జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 3,76,288 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 2,19,729.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,56,558.5 క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వ ఉన్నట్లు తెలిపారు . మంగళవారం ఒక్కరోజులోనే 10,091.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు తెలిపారు. రవాణా కోసం 458 లారీలు, 131 ట్రాక్టర్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అదనంగా మరో 1,50,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.యెల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, జూలూరుపాడు, గుండాల, అల్లపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను త్వరితగతిన గోదాములకు తరలిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని అన్నారు . రైతుల ఖాతాల్లో చెల్లింపులు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆ ప్రకటనలో తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :