తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాదావత్ రవి కథనం ప్రకారం. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య పన్నాలాల్, తండ్రి పేరు: రామ్య, 50 సంవత్సరాలు అను అతను ఈరోజు అనగా తేదీ 04.02.20226న ఉదయం 11:30 సమయంలో పొలం పనులకు తన భార్యతో కలిసి వెళ్లినాడు.పొలం నందు పనులు ముగించుకొని, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి రాగా, ఇంటి వెనకాల వైపు ఉన్న తలుపు పగలగొట్టబడి ఉన్నది మరియు ఇంటి గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి అందులో ఉన్న సామాన్లన్నీ చిందరవందరంగా పడేసి ఉన్నాయి, దగ్గరికి వెళ్లి పరిశీలించి చూడగా, బీరువాలో దాచిపెట్టిన రెండు జతల వెండి పట్టీలు మరియు అర తులం బరువు గల రెండు బంగారపు ఉంగరాలు కనబడలేదు. వీటితోపాటు బీరువాలో గతంలో దాచి ఉంచిన 15వేల రూపాయలను కూడా దొంగలు అపహరించుకుపోయినారని, దొంగతనం కాబడిన బంగారము, వెండి వస్తువుల విలువ మరియు నగదు మొత్తం కలిపి 66 వేల రూపాయల వరకు ఉంటుందని, దొంగల ఆచూకీ కనుగొనవలసిందిగా భూక్య పన్నాలాల్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బాధావత్ రవి తెలియజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ