తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల న్యాయమైన 31 డిమాండ్ల పరిష్కారమే మా ప్రధాన లక్ష్యం లేకుంటే సమ్మె..ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్. సింగరేణి కార్మికుల 31 డిమాండ్లను పరిష్కరించడంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ డిమాండ్ చేశారు.హైదరాబాద్లో గురువారం జరిగిన ఆర్ ఎల్ సి చర్చల్లో కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ఈ నెల 21న చర్చలు విఫలమైతే ఫెయిల్యూర్ రిపోర్ట్ తీసుకొని,అనంతరం అన్ని కార్మిక సంఘాల సహకారంతో సమ్మెకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.మెడికల్ బోర్డును ప్రతి నెల మూడో వారంలో నిర్వహించాలని, కారుణ్య నియామకాలు, మెడికల్ ఇన్వాలిడేషన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మెడికల్ అటెండెన్స్ నిబంధనలను మార్చి కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2016–17 బ్యాచ్ జేఎంఈటీల ప్రమోషన్ సమస్యను పరిష్కరించి, ఖాళీల ఆధారంగా బీ గ్రేడ్ ప్రమోషన్లు కల్పిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిపారు.మారుపేర్ల సమస్య పరిష్కరించాలి మారుపేర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ కోరారు.ముఖ్యమంత్రి హామీ మేరకు ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ ద్వారా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాధిత కార్మికుల ఉద్యమానికి ఏఐటీయూసీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.సింగరేణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 54 వేల కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకాన్ని అమలు చేయడంతో పాటు హెచ్ఆర్ఏను 8 శాతానికి పెంచాలని కోరారు. కట్ చేసిన ఇంక్రిమెంట్ల సమస్యను పరిష్కరించాలని, పెండింగ్ విజిలెన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. సింగరేణిలో అన్ని విభాగాలను అవుట్సోర్సింగ్కు అప్పగించకుండా సింగరేణి యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘ఎన్ మైనస్’ విధానాన్ని ఎత్తివేయాలని కోరారు. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు అందించే పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.పెర్క్స్ ఐటీపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి పెర్క్స్పై విధిస్తున్న ఐటీ భారంపై సింగరేణి యాజమాన్యం స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని వారు అన్నారు. 31 డిమాండ్లలో కీలకమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాలినీ. ఈ నెల 21 తర్వాత కూడా పరిష్కారం లభించకపోతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని సమ్మెకు వెళ్తాం” అని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శిలు రమణమూర్తి,జక్కుల గట్టయ్య,ఉపాధ్యక్షులు క్రిస్టోఫర్,సహాయ కార్యదర్శి రాము,తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ