తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన ఆయుర్వేద వైద్యం మోడ్రన్ వైద్యానికి ధీటుగా ఉండాలి.ఆయుర్వేద మహర్షి రవి వర్మ.ఔషధ మొక్కలు పెంపకానికి ప్రోత్సాహాన్ని కల్పిస్తాం. పిఓ రాహుల్ ఐ.ఏ.ఎస్.ప్రస్తుతం వస్తున్న వ్యాధులను అరికట్టేందుకు, మోడరన్ వైద్యానికి దీటుగా మన పారంపర్యవైద్యం ఉండాలని ప్రముఖ ఆయుర్వేద మహర్షి రవివర్మ అన్నారు. ఆయుర్వేద ఫార్మసీలకు లైసెన్సులను పొంది, మన ఉనికిని చాటి చెప్పేందుకు లీగల్గా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మనకున్న బలహీనతలను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా మన ఆయుర్వేదాన్ని చాటి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం ఐటిడిఏ పిఓ బి. రాహుల్ (ఐ.ఏ.ఎస్) మాట్లాడుతూ.. భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఆయుర్వేద ఔషధ మొక్కలు అనేక వందల రకాలు ఉన్నాయని, వాటిని మీ వైద్యులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇదివరకే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయుర్వేదానికి అనేక అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఆయుర్వేద అభివృద్ధికి మీ సంఘం ముందుకు వస్తే, దానికి సంబంధించిన విషయాలను ప్రభుత్వంతో మాట్లాడి, ఔషధ మొక్కలు పెంచుకునేందుకు కొంత భూమిని సైతం కేటాయింప చేయిస్తానని వెల్లడించారు. నా చిన్నప్పటినుంచి మా కుటుంబంలోని సభ్యులకు, అనేక అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు, ఎక్కువగా ఆయుర్వేదాన్ని అనుసరించి తగ్గించుకునే వారమని గుర్తు చేసుకున్నారు. అనంతరం రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ ..కెమికల్స్ లేని ప్రకృతి ఇచ్చిన మొక్కలతోనే తయారుచేసిన మందులను వాడటం ఆరోగ్య దాయకమని తెలియజేశారు.అడిషనల్ డిఎం అండ్ హెచ్ ఓ డా.సైదులు మాట్లాడుతూ వారంపర వైద్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా పనిచేస్తుందని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, స్థానిక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ..తక్కువ ఖర్చుతోనే పారంపర్య వైద్యం ద్వారా అనేక రకాలైన మొండి వ్యాధులను తగ్గించుకునే అవకాశం ఉందని, దీని వ్యాప్తిని పేద ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు,ఈ సభలో మల్లిశాలస్వామీజీ, కృష్ణయ్య స్వామి, పుత్తూరు వైద్య వ్యవస్థాపకులు చంద్రశేఖర రాజు, వారం పర్య వైద్య మహా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దొంతు యాత్రి మహా రుషి, ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వర్లు, ఎండి.జమాల్ ఖాన్, రామంచి శ్రీనివాస్, భాను ప్రసాద్, దుర్గారాణి, అరుణ, వీరభద్రాచారి, రామకృష్ణ, వాహదలి, బొబ్బిలి మోహన్, పద్మారావు, సిహెచ్ రవీందర్, రాచూరి రాజు, ఆ సంఘం జిల్లా కన్వీనర్ జి. సుగుణారావు, నాగేశ్వరరావు లు పాల్గొనీ మాట్లాడారు. 500 రకాల ఔషధ మొక్కలను, మహాసభల స్టాల్లో ఏర్పాటుచేసిన కొత్తగూడానికి చెందిన మొక్కల వెంకటయ్యను ఈ సందర్భంగా రాహుల్ అభినందించారు. వైద్యులు, ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త, కపాలను తెలియజేసే బయోక్లాక్ (జీవగడియారాన్ని) ఆవిష్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ