Wednesday, 16 September 2026 06:52:43 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

SP రోహిత్ రాజు ఆదేశాల మేరకు అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించిన షీ టీమ్ ఎస్ఐ రమాదేవి.

Date : 13 August 2026 05:08 PM Views : 139

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయని షి టీం ఎస్‌ఐ రమాదేవి అన్నారు. గురువారం కొత్తగూడెం పోస్ట్‌ఆఫీస్ సెంటర్‌లోని ఒక ప్రైవేట్ కాలేజీలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ రమాదేవి మాట్లాడుతూ ఉద్యోగం కేవలం డబ్బు సంపాదించేందుకు మాత్రమే కాకుండా వ్యక్తికి ఆర్థిక స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసాన్ని కల్పించే సాధనమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడాలని సూచించారు.చిన్నచిన్న గొడవలు, అనవసరమైన కేసులకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. చిన్నపాటి కేసులు కూడా భవిష్యత్తులో ఉద్యోగాల ఎంపిక, పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మహిళలు, పిల్లల రక్షణకు ‘పోలీస్ అక్క’జిల్లాలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళలకు అందుబాటులో ఉండేలా మహిళా పోలీస్ అధికారిని నియమించినట్లు చెప్పారు. మహిళలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.అత్యవసర వేళ 112కు సమాచారం.మహిళల రక్షణతో పాటు ఫైర్ సర్వీసులు, వైద్య సహాయం, విపత్తుల సమయంలో అత్యవసర సేవలు పొందేందుకు 112 నంబర్‌ను వినియోగించుకోవాలని తెలిపారు. ప్రయాణ సమయంలో కూడా భద్రత కోసం అందుబాటులో ఉన్న సాంకేతిక సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో she team ASI Nagaiah, PC Rambabu,కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :