తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ మోటర్ ట్రాన్స్పోర్ట్ వర్క్ షాప్ నందు ఏర్పాటు చేసినటువంటి టు పోస్ట్ హైడ్రాలిక్ వెహికల్ లిఫ్టర్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించడం జరిగింది. ఈ పరికరాన్ని ఉపయోగించి కారు యొక్క క్రింది భాగంలో చేయవలసిన ఇంజన్, గేర్ బాక్స్ రిపేర్లను సులభతరంగా చేయవచ్చును. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు వాహనాలు నిరంతరం విధులకు ఉపయోగించడం వల్ల వాహనాలకు ఏర్పడే మరమ్మత్తుల కోసం మెకానికల్ వర్క్ షాపుల వద్ద ఎక్కువ సమయం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడింది దానికి ప్రత్యామ్నాయం గా మోటర్ ట్రాన్స్పోర్ట్ వర్క్ షాప్ నందు హైడ్రాలిక్ వెహికల్ లిఫ్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ పరికరాన్ని ఉపయోగించి పనిని వేగవంతంగా చేయడమే కాకుండా నిర్వహణ ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామి, భద్రాచలం డిఎస్పి అరుణ్ కుమార్, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఓ. సుధాకర్ రావు, నరసింహారావు, లాల్ బాబు, కృష్ణ మరియు సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ