తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : నవంబర్30 ,డిసెంబర్ 1 తేదీన వరంగల్ నక్కలగుట్ట లో జరిగే రెండవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఐఏఎల్ రాష్ట్ర నాయకులు ఏలమోలు ఉదయ భాస్కరరావు న్యాయవాదులకు పిలుపునిచ్చారు . మంగళవారం భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలపై, నూతన చట్టాలపై సదస్సు నిర్వహించబడుతుందని ఈ యొక్క సదస్సులో జిల్లా నుండి అత్యధిక న్యాయవాదులు పాల్గొని సదస్సు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు .అనంతరం రెండో మహాసభల పోస్టులను ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భాగం మాధవరావు ,జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు ,ఉప్పు శెట్టి సునీల సత్యనారాయణ, పేరరాల నాగరాజు ,పేరాల వెంకటేశ్వర్లు, మహేశ్వరరావు ,సంధ్య, రమ ,తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ