తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామం నందు గల వైకుంఠధామం నందు క్రీ" శే" కొదుమూరి రాఘవయ్య శకుంతల దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి కొదుమూరి కోటేశ్వరరావు నిర్మించిన స్మశాన నాధుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ళ వెంకట రెడ్డి .ఈ సందర్భంగా పాపకోల్లు గ్రామంలోని శ్రీ ఉమా సోమలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆ పరమశివుడికి భక్తిశ్రద్ధలతో వైకుంఠధామం నందు నిర్మించిన స్మశాననాథుడి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ , జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు అల్లాడి నరసింహారావు , వెంకన్నపాలెం మాజీ ఎంపిటిసి దుద్దుకూరి మధుసూదన్ రావు , సిపిఎం మండల కార్యదర్శి యాసా నరేష్ , టీపీసీసీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, ధరావత్ రాంబాబు, జిల్లా ఎస్టీ సెల్ కార్యదర్శి గూగులోత్ శ్రీనివాసరావు, మండల ఓబీసీ సేల్ అధ్యక్షులు గోపు రామకృష్ణ, నున్నా కృష్ణయ్య, ధరావత్ కాన్సిరాం నాయక్, వేల్పుల నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు లకావత్ లచ్చు నాయక్, నున్నా రంగారావు, మద్దిశెట్టి వంశీ, మోదుగు రామకృష్ణ, ధర్మరాజుల సత్యనారాయణ, నిమ్మటూరి కనకయ్య, బానోత్ ఎర్ర బాబు, పూరేటి తిరుపతిరావు, చౌడం నరసింహారావు, ధర్మరాజుల సత్యనారాయణ, ఉసికెల వెంకటేశ్వరరావు, నిమ్మటూరి ముత్తయ్య, భూక్య ప్రసాద్, వాంకుడోత్ కిషన్ నాయక్, తోట శ్రీనివాసరావు, భూక్యా అమృ నాయక్, నునావత్ మోహన్ నాయక్, ధర్మరాజుల వెంకటనారాయణ, అజ్మీరా రాంబాబు, మాలోత్ స్వామి,భుఖ్యా చందా నాయక్, బానోత్ హనుమ మరియు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ