తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఒకటో వార్డులో ప్రజల సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ చైర్ పర్సన్ జూపల్లి శశికళమ్మ సమస్యలు తెలుసుకుని వెంటనే చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంగా ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేష్ బాబు ప్రజలతో కలిసి సమస్యల పరిష్కారానికి కదిలి అధికారులతో సమన్వయం చేస్తూ సెలవుదినాన కూడా సేవలందించారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలపై వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించడం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి డేరంగుల ప్రసాదు కూడా ప్రజల సమస్యలపై నువ్వు సైతం అంటూ ముందుకొచ్చి ప్రజలతో కలిసి సమస్యలను గుర్తించి పరిష్కార దిశగా కృషి చేస్తున్నరు
Admin
తెలుగు వెలుగు టీవీ