తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జనగణన కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ బ్లాక్ (హెచ్ఎల్బి) ప్రక్రియలో నమోదవుతున్న పొరపాట్లు, వాటి సవరణ విధానం, ఫీల్డ్ స్థాయిలో అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, చార్జ్ ఆఫీసర్లు, హెచ్ఎల్బి సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలీకేర్ పాల్గొని పలు మార్గదర్శకాలు జారీ చేశారు.హౌస్ లిస్టింగ్ సమయంలో గృహాల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, మౌలిక సదుపాయాల వివరాలు నమోదు చేసే సమయంలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎక్కువగా దొర్లుతున్న సాధారణ తప్పులను వివరిస్తూ, వాటిని తక్షణమే సరిచేసే విధానంపై సూపర్వైజర్లు మరియు చార్జ్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. నమోదు చేసిన వివరాలను పునఃపరిశీలించి డేటా ఖచ్చితత్వాన్ని నిర్ధారించాలని తెలిపారు .ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, సిపిఓ సంజీవరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత , పాటు సంబంధిత శాఖల చార్జ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి నాణ్యమైసమాచార సేకరణకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ