Thursday, 17 September 2026 03:39:30 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

బాల కార్మికులను గుర్తించండి, వారి మంచి భవిష్యత్తు కోసం పాఠశాలల్లో చేర్పించండి... గోడ పత్రిక ఆవిష్కరణ : జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

Date : 12 June 2025 02:09 PM Views : 638

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బడి ఈడు బాలలందరూ బడిలోనే ఉండాలని బాల కార్మికులు గా ఎవరూ మిగిలిపోకూడదని జిల్లా అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. జూన్ 12 ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ పత్రికను ఆయన గురువారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనందున బడి ఈడు పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలని ఎవరు కూడా పని ప్రదేశంలో ఉండవద్దని బాలలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బడిబాట కార్యక్రమం ప్రారంభమైనందున ప్రజలు తల్లిదండ్రులు అధికారులు అందరూ కలిసి నూరు శాతం పాఠశాలలో నమోదు జరిగే విధంగా కృషిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా రూపొందించడానికి కృషి చేయాలని తెలిపారు. బాలలు ఎక్కడెక్కడ పని ప్రదేశాలలో ఉన్నారో గుర్తించాలని తెలిపారు. జిల్లాలోని బడిఈడు బాలలందరూ తప్పనిసరిగా పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎం డి షార్పోద్దీన్ , జిల్లా బాలల పరిరక్షణ అధికారిని హరి కుమారి, డిసిపియు యూనిట్ బాధ్యులు అజీజ్, నాగరాజు ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :