Sunday, 02 August 2026 06:51:38 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్.

Date : 09 March 2026 04:44 PM Views : 351

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలోని వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ములకలపల్లి మండలంలో పర్యటించి ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలోని అన్ని తరగతి గదులను సందర్శించి విద్యార్థుల హాజరు, బోధన పరిస్థితులను పరిశీలించారు. అలాగే వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, ఆహరపదార్దాల నాణ్యత,పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీశారు.అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఏ కోర్సులు చదవాలని భావిస్తున్నారు, భవిష్యత్తులో ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కేజీవీబీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ–ఫైనల్ పరీక్షలను కూడా కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్న తీరు గమనించి, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాబోయే పరీక్షలకు సమగ్రంగా సిద్ధం కావాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్లో స్నాక్స్ అందించాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు.విద్యార్థులకు పాఠశాలలో అందిస్తున్న సౌకర్యాల గురించి కూడా విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉపయోగిస్తున్న పుస్తకాలను పరిశీలించి వారి రాత సామర్థ్యాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థులకు శుద్ధమైన తాగునీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంట చేసే సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అలాగే పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులందరి బాధ్యత అని అన్నారు. వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమర్థంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మహేశ్వరి, ఎంఈఓ సత్యనారాయణ, ఎంపీడీవో, ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపల్ అశోక్, పాఠశాలల బోధన బోధనేతర సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :