Thursday, 02 July 2026 04:24:28 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

​అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయించాలి : ఏఐటీయూసీ (AITUC) నాయకులు

Date : 22 June 2026 04:47 PM Views : 76

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్‌వాడీలకు ‘ఎన్నికల విధుల’ సెగ! అంగన్‌వాడీలపై 'బీఎల్‌ఓ' భారం.. మూతపడే దిశగా కేంద్రాలు! ​- కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ (AITUC) నాయకులు జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లకు అదనంగా కేటాయించిన బీఎల్‌ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్‌లో అధికారులను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు . ​సహాయకులు లేక సతమతం.. ​ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలోని దాదాపు 50 శాతానికి పైగా అంగన్‌వాడీ కేంద్రాలలో గత కొన్నేళ్లుగా హెల్పర్లు (సహాయకులు) లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల టీచర్లే అటు బోధనతో పాటు ఇటు కేంద్రాల నిర్వహణ పనులను కూడా ఒంటరిగా చూసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అదనంగా ఓటర్ల జాబితా సవరణ వంటి బీఎల్‌ఓ విధులను అప్పగించడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.​పౌష్టికాహారం, ముందస్తు విద్యకు ఆటంకం ​టీచర్లు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం వల్ల కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లలకు అందాల్సిన పౌష్టికాహార పంపిణీతో పాటు, ప్రీ-స్కూల్ బోధన పూర్తిగా కుంటుపడుతోందని వారు తెలిపారు. ప్రభుత్వంలో పంచాయతీరాజ్, ఉపాధి హామీ , విద్యా శాఖ వంటి ఇతర శాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం అంగన్‌వాడీ టీచర్లపైనే ఈ భారాన్ని నెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ​కనీస సౌకర్యాలు లేవు.. ​బీఎల్‌ఓ విధులకు సంబంధించి ఎలాంటి అలవెన్సులు (TA, DA) ఇవ్వకపోగా, ఆన్‌లైన్ పనుల కొరకు కనీసం ట్యాబ్‌లు లేదా మొబైల్ ఫోన్లు కూడా సమకూర్చలేదని మండిపడ్డారు. కావున, ఉన్నతాధికారులు మరియు ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి అంగన్‌వాడీ టీచర్లను బీఎల్‌ఓ విధుల నుండి మినహాయించాలని, లేనిపక్షంలో మాతా శిశు సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :