Thursday, 14 May 2026 02:24:15 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.

Date : 08 October 2025 07:38 PM Views : 482

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్. డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ (బి.ఆర్) గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోలుత పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అనంతరం ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ అనుబంధ సంఘం దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వం. ఈ కార్యక్రమానికి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు బరిగెల భూపేష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు,డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి జరగడం భారతదేశ న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయనమని పేర్కొన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి తక్షణమే బహిష్కరించి నాన్బెయిలబుల్ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కరిషా రత్నకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు మామిడి ధనలక్ష్మి, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు రవి కిరణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, టి. నర్సింగరావు ,జంగం ప్రసాదరావు, మంద నిర్మల, పి.భాగ్య, మద్దెల విజయలక్ష్మి, మెరుగు అనసూయ, దార్ల లక్ష్మి, అన్నెం లక్ష్మీనారాయణ,పి.రోజా, ఉస్మాన్ ఖాన్, పి.నర్సిరెడ్డి, బి. సత్తెమ్మ,కే. భారతి, ఎండి ఆశబి, ఎండి యాకుబ్ పాషా, ఎస్.కె అహ్మద్ బాషా బట్టు సన్నీ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :