తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు ఈ రోజు భాగ్యరెడ్డి వర్మ జయంతిని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప మహనీయులు, గొప్ప సంఘసంస్కర్త భాగ్యరెడ్డి వర్మ అని అన్నారు. భాగ్యరెడ్డి అసలు పేరు మ్యాదరి భాగయ్య అని ఎన్నో పోరాటాల ఫలితంగా వర్మ అనే బిరుదు వచ్చిందని అన్నారు. సమాజంలో అందరూ సమానమే అని, సమసమాజ నిర్మాణం కోసం పోరాటం చేసారని అన్నారు. అణగారిన, దళితుల అభివృద్ధికి విద్యాసంస్థలు నెలకొల్పి వారి జీవితాల్లో విద్య తో వెలుగులు నింపారని కొనియాడారు.జగన్ మిత్ర మండలిని స్థాపించి దళితుల చైతన్యం కోసం పాటుపడ్డారని అన్నారు.దేవదాసి, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వారి కోసం కృషి చేశారు. వారి జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్.ఐ లాల్ బాబు, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,ఎం.టి.ఓ సుధాకర్,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ