Sunday, 02 August 2026 01:12:30 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

పోలవరం ముంపు ముప్పుపై మౌనం వీడాలి : కల్లూరి, రావులపల్లి డిమాండ్

Date : 11 July 2026 01:46 PM Views : 51

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : - బ్యాక్‌వాటర్ వాస్తవాలను ప్రజల ముందుంచాలి - వరదలపై అధికార యంత్రాంగం సమన్వయంతో కదలాలి - అసంపూర్తి కరకట్టను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి - కల్లూరి, రావులపల్లి డిమాండ్ పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో భద్రాచలానికి పొంచి ఉన్న ముంపు ముప్పుపై ప్రభుత్వాలు మౌనం వీడి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ హడావుడి చేయడం, వరదలు తగ్గగానే సమస్యను గాలికొదిలేయడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. రాబోయే వరదలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కదిలి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు. పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాచలం, పరిసర ప్రాంతాలకు ఎంతమేర ముంపు ప్రమాదం ఉందనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని, శాస్త్రీయ నివేదికలు, బ్యాక్‌వాటర్ లెక్కలను దాచిపెట్టకుండా బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. భద్రాచలం మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు. వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించాల్సిన కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణం నుంచి మారుమూల ఏజెన్సీ గ్రామాల వరకు నిరంతర పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గిరిజన గ్రామాలు విషజ్వరాల గుప్పిట్లో చిక్కుకున్న తర్వాత వైద్య బృందాలను పరుగులు పెట్టించడం కాకుండా ముందస్తుగానే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైన మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి ప్రతి గిరిజన గ్రామంపై ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో రాజీకి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భక్తుల సౌకర్యాలు, ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా అభివృద్ధి పనులు సాగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్ కంచర్ల జమలయ్య, కంభం మెట్టు శ్రీను, మా రెడ్డి శివాజీ మీసాల భాస్కరరావు, ఎస్వీఎస్ నాయుడు, భద్రాద్రి వెంకటేశ్వరరావు, మహేష్, సాధన పల్లి సతీష్ వేణు గుంజ రామారావు, సత్తినేడు సాయిరాం, రుద్ర బ్రదర్స్, చింతల రామరాజు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :