Thursday, 14 May 2026 01:03:27 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

జులై 9న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల సమావేశం.

Date : 05 July 2025 04:45 PM Views : 574

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులై 9న తలపెట్టిన కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం కొత్తగూడెం లోని రైటర్ బస్తీ IFTU కార్యాలయం నందు ముఖ్య సమావేశం జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు,జిఎల్బి కేస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చారువాక, టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు కోటయ్య పాల్గొని ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా ఎంతో మంది అమరుల త్యాగంతో సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోఢ్ లు గా తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాల రాస్తున్నారని వారన్నారు ఈ దేశంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వo కనీస వేతనాలను అమలు చేయడం లేదని వారన్నారు. ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వాటిని భర్తీ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని వారు విమర్శించారు. పారిశ్రామిక రంగాలను జాతీయం చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని వారన్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పర్మినెంట్ చేయాలని పెండింగ్లో ఉన్న 57 జీవోలని అమలు చేయాలని వారు అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం మాత్రమే పనిచేస్తుందని కార్మిక వర్గం కోసం పనిచేసే విధంగా లేదని వారు అన్నారు అందులో భాగంగానే ఖనిజ సంపద ఉన్న దగ్గర ఆయా రాష్ట్రాల పర్మిషన్లు లేకుండానే కార్పొరేట్ శక్తులైన ఆదాని అంబానీలకు తాకట్టు పెడుతున్నారని వారన్నారు. మరోపక్క రాష్ట్రాలకు ఉన్న హక్కులని కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వమే ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తుందని వారు విమర్శించారు ఈ సమస్యల పరిష్కారం కోసం జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు జిల్లా నాయకులు వాసు,వివిధ కార్మిక సంఘాల నాయకులు శ్రీను కృష్ణ శరత్ రామకృష్ణ రాజేష్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :