తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రంజాన్ మాసంతో సమాజంలో ఐక్యత, శాంతి పరస్పర గౌరవం పెరుగుతుందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ సందర్బంగా మైనార్టీ సోదరుల ప్రార్థనకు చేరుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం ఉపవాసం ద్వారా కేవలం ఆధ్యాత్మిక శుద్ధి మాత్రమే కాదని, పరస్పర గౌరవం,సహనం వంటి విలువలను కూడా నేర్పిస్తుందని విభిన్న మతాలు ఉన్నా మనందరి లక్ష్యం శాంతి, మానవత,సౌభ్రాతృత్వమేనని ఐక్యతతో ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ఈ రంజాన్ పర్వదినం మనలో ప్రేమను పెంపొందించి, సమాజంలో శాంతి,ఐక్యతను బలపరచాలని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ