Wednesday, 17 June 2026 02:49:32 PM
# జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్. # అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # సింగరేణి యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలి - గుర్తింపు సంఘం కేంద్ర కౌన్సిల్ సమావేశంలో కూనంనేని. # 16 వ డివిజన్లో ఇందిరమ్మ చీరల పంపిణీ. 18 సంవత్సరాల పైపడిన మహిళలందరికీ చీరలు ఇవ్వాలి. 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.

నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్

Date : 08 June 2026 06:32 PM Views : 67

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షకు జిల్లాలో మొత్తం 1,128 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకోసం జిల్లాలో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సింగరేణి ఉమెన్స్ కళాశాలలో 360 మంది, టీజీఎస్‌డబ్ల్యూఆర్ పాఠశాల మరియు కళాశాల, పాల్వంచలో 288 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో 240 మంది, శ్రీరామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కొత్తగూడెంలో 240 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వివరించారు. అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీలు వంటి ప్రక్రియల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్ కార్డుపై తప్పనిసరిగా ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో పాటు తాజా ఫోటో ఉన్న గుర్తింపు కార్డును వెంట తీసుకురావాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, వాచీలు, బెల్టులు, చైన్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఉంగరాలు తదితర ఆభరణాలు అనుమతించబడవని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా రోజున విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. నీట్ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమైనదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , నీట్ (యూజీ)-2026 పునఃపరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రశ్నాపత్రాల రవాణా నుంచి జవాబు పత్రాల భద్రత వరకు అన్ని దశల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడతామని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు . సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు మరియు వారి తల్లిదండ్రులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పరీక్షా నిబంధనలను పాటిస్తూ నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డి సెక్షన్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, తాసిల్దార్లు పుల్లారావు, దారా ప్రసాద్,పరీక్షా కేంద్రాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: