తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెట్రోలింగ్,బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. 100 డయల్ నకు ఫోన్ రాగానే తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు అండగా ఉండాలి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. సోమవారం మణుగూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని,వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా నిత్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.పెట్రోలింగ్,బ్లూ కోల్ట్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నూతనంగా నిర్మాణంలో ఉన్న మణుగూరు పోలీస్ స్టేషన్ భవనాన్ని కూడా ఈ సందర్బంగా ఎస్పీ పరిశీలించారు.పాత పోలీస్ క్వార్టర్స్ పరిసరాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,సీఐ నాగబాబు,ఎస్సై శ్రావణ్,సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ