తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం సెక్టార్, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రామవరం నేతాజీ స్కూల్లో ఏర్పాటుచేసిన పోషణ అభియాన్ లో ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి, 10 ,11 వార్డుల కౌన్సిలర్లు మునిగడప పద్మ ,బుక్య శ్రీనివాసులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికల్లో రక్తహీనత ను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పౌష్టికాహారం -దానిలోపం వల్ల జరిగే నష్టాలను బాలికలకు వివరించి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే రక్తహీనత నుండి బాలికలు రక్షణ పొంది ఆరోగ్యకరమైన బాలికలుగా పరినితి పొందుతారని వారు అన్నారు. ఏ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తహీనత నుండి రక్షణ పొందు తరో వాటిని ప్రాజెక్టు ద్వారా వివరించారు. అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ద్రౌపతి, అంగన్వాడీ టీచర్స్ డి నీలవేణి, కల్లూరి రజిత, రమాదేవి, వాణి, ఈశ్వరి మరియు బాలికలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ