తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని ఉద్యమాలు నిర్మించాలని కొత్తగూడెం మేయర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా శనివారం సిపిఐ కొత్తగూడెం పట్టణ కౌన్సిల్ ఆధ్వర్యంలో 52వ డివిజన్ మేదర బస్తిలో వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ, నాటి నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీపై ఎర్రజెండా అండతో వేలాది మంది ప్రాణాలర్పించి భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడారని గుర్తుచేశారు. ఆ చారిత్రక పోరాటంలో ఎలాంటి పాత్ర లేని బిజెపి, ఆర్ఎస్ఎస్ శక్తులు నేడు రాజకీయ లబ్ధికోసం చరిత్రను వక్రీకరించేందుకు కుట్రలు పన్నుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర పాలకుల ప్రజావ్యతిరేక విధానాలు, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి ఉద్యమ బాట పట్టించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ విముక్తి కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, ఆ పోరాట వారసత్వాన్ని నేటి తరం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు భూక్య శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, మాచర్ల శ్రీనివాస్, సపోర్ట్ రవి, ధనరాజ్, అజయ్, సురేష్, హైమద్, రాజా, కళ్యాణ్, రాజు, రాము, కైసర్, విక్కీ బాయ్స్ యూత్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ