Wednesday, 16 September 2026 05:23:56 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి.

Date : 24 August 2026 07:24 PM Views : 88

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీపై ప్రత్యేక దృష్టి .నోటీసులు జారీ చేసే సమయంలోనే అవసరమైన పత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలి .వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సూచించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని సూచించారు. నోటీసులు జారీ చేసిన అనంతరం అవసరమైన ఓటర్లను విచారణకు పిలిపించి, సంబంధిత పత్రాలు, ఆధారాలను పరిశీలించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పారదర్శకత, కచ్చితత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.నోటీసులు జారీ చేసే సమయంలోనే విచారణకు హాజరయ్యే ఓటర్లు సమర్పించాల్సిన అవసరమైన పత్రాలు, ఆధారాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రక్రియను వివరించాలని సూచించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సంబంధిత ఎన్నికల అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నోటీసులో విచారణ తేదీ, విచారణ జరిగే ప్రదేశం, సమయాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు.నోటీసు జారీ చేసిన తేదీకి, విచారణ తేదీకి మధ్య కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నోటీసులు అందజేసిన వివరాలను బీఎల్‌ఓ యాప్‌లో ఫొటోతో సహా నమోదు చేయాలని, విచారణకు సంబంధించిన వివరాలతో పాటు ఓటర్లు సమర్పించిన పత్రాలు, ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, బూత్ స్థాయి అధికారులకు అవసరమైన అవగాహన కల్పిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దశను కచ్చితంగా అమలు చేయాలని, ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎన్నికల విభాగం సూపర్డెంట్ రంగ ప్రసాద్ , సంబంధిత శాఖల అధికారులు,ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :