తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 13 (తెలుగు వెలుగు)తెలంగాణ తహసీల్దార్ ల అసోసియేషన్ (TGTA ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం ను కొత్తగూడెం లోని మధువన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర TGTA ప్రెసిడెంట్ s. రాములు మరియు తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టి జి ఆర్ ఎస్ ఏ) జనరల్ సెక్రటరీ శ్రీ v . బిక్షం , vro ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికే ఉపేందర్ , శ్రీ శంకర్ శ్రీను tgta రాష్ట్ర ట్రెసరరీ హాజరైనారు.
ఇట్టి సమావేశంలో tgta మరియు టి జి ఆర్ ఎస్ ఎ ఆవిర్భావం ఆవశ్యకత మరియు గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం గురించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ తీర్మానించనైనది. ఇట్టి సమావేశంలో నూతన రెవెన్యూ చట్టం గురించి, అన్ని క్యాడర్లలో ఉన్న ఉద్యోగుల సర్వీసు సంబంధించిన మరియు ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన విషయంలో మరియు ఎలక్షన్ బదిలీ విషయంలో సుదీర్ఘంగా చర్చించి తెలంగాణ రెవిన్యూ జేఏసీ చైర్మన్ శ్రీ వాళ్ళు. లచ్చిరెడ్డి ,ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరించడం జరుగుతుందని తెలియజేయడమైనది ఇట్టి కార్యక్రమం నందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TGTA నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ