తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం, కొత్తగూడెం ఆగస్టు 17 (తెలుగు వెలుగు) బెంగాల్ రాష్ట్రం కలకత్తా నగరంలో మెడికల్ విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తు NSUI నేషనల్ అధ్యక్షుడు వరుణ్ చౌదరి మరియు NSUI రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఆదేశానుసారం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ మెడికో విద్యార్థిని అత్యాచార ఘటన దురదృష్టకరం అన్నారు. అత్యాచార ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో NSUI నాయకులు అబ్దుల్ హమీద్, షేక్ అజార్, కందాల విజయ్, మాలిక్ దీపక్, తరుణ్, రాచకొండ సాయి, షేక్ షాను, కాటి సందీప్, షేక్ సద్దాం, షేక్ ఇస్మాయిల్, మోహిన్, సమీర్, మజార్, తదితరులు పాల్గొన్నారు...
Admin
తెలుగు వెలుగు టీవీ