Thursday, 02 July 2026 04:24:31 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 23 June 2026 04:52 PM Views : 55

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గల బాలుర గురుకుల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పి రోహిత్ రాజు పాఠశాల విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి,అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిధిలో మొక్కలు నాటారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక లాంటివారు, క్షణకాలపు ఆనందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై, తమ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, వైజ్ఞానిక పరిజ్ఞానం పిల్లలకు అవసరమని, సినిమాలలోని మంచిని గ్రహించి చెడుని వదిలేయాలని, చదువుల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనానికై క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తన కదలికలను గమనిస్తూ ఉండాలని సూచనలు చేశారు. అనంతరం సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని,చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. మహిళలకు, విద్యార్థినులకు రక్షణగా జిల్లాలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, అత్యవసర సమయాల్లో 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచనలు చేశారు. అనంతర రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. సుమారు 300మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్. సతీష్ కుమార్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, ఎక్సైజ్ సీఐ ప్రసాద్, పోలీసు అధికారులు, పాఠశాల మరియు కళాశాల, అధ్యాపకులు,ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :