Thursday, 17 September 2026 08:39:18 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి: ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

Date : 23 June 2026 04:52 PM Views : 129

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గల బాలుర గురుకుల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పి రోహిత్ రాజు పాఠశాల విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి,అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిధిలో మొక్కలు నాటారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక లాంటివారు, క్షణకాలపు ఆనందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై, తమ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, వైజ్ఞానిక పరిజ్ఞానం పిల్లలకు అవసరమని, సినిమాలలోని మంచిని గ్రహించి చెడుని వదిలేయాలని, చదువుల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనానికై క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తన కదలికలను గమనిస్తూ ఉండాలని సూచనలు చేశారు. అనంతరం సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని,చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. మహిళలకు, విద్యార్థినులకు రక్షణగా జిల్లాలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, అత్యవసర సమయాల్లో 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచనలు చేశారు. అనంతర రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్‌ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. సుమారు 300మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్. సతీష్ కుమార్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, ఎక్సైజ్ సీఐ ప్రసాద్, పోలీసు అధికారులు, పాఠశాల మరియు కళాశాల, అధ్యాపకులు,ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :