Thursday, 17 September 2026 03:24:19 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెం నియోజకవర్గంలో పాడైన రోడ్లను బాగు చేయాలి - కాపు సీతాలక్ష్మి

Date : 27 October 2025 02:32 PM Views : 458

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా గుంతలు పడ్డ రోడ్లను బాగు చేయాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో సోమవారం కొత్తగూడెం రైల్వే అండర్ బ్రిడ్జి, గోధుమ వాగు బ్రిడ్జి పై పడ్డ గుంతల వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ మీద పెట్టే శ్రద్ధ ప్రజా పాలన మీద లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 22 నెలల కాలం గడుస్తున్న పాడైన రోడ్ల వద్ద తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదని మండి పడ్డారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన ఉంటేనే రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. శాశ్వత ప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పాడైన రోడ్లను బాగు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామిని అమలు చేయలేదని, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను దగా చేశారని విమర్శించారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకునే విద్యార్థినికి స్కూటీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ.2500 వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. తక్షణమే రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబుల వేణు, లక్ష్మీదేవి పల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ నాయక్, బాబుజానీ, మధు, నిజాం, హైమద్, అశోక్, రాసపల్లి శీను, సురేందర్, బాబా, అమన్, మనోజ్, యుగంధర్, చందు, షణ్ముఖ సాయి, అబ్బు, చందు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :