తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఏజెన్సీ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి టివిఆర్ చంద్రం చేసిన కృషి చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఉన్నారు. టివిఆర్ చంద్రం 20వ వర్ధంతి సందర్భంగా భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్లో ఎగరేసిన ఎర్రజెండా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన పాషా మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో టివిఆర్ చంద్రం చేసిన పోరాటాలు నేటికీ చిరస్కరణీయం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో గిరిజనులు, కార్మికులు బలహీన సబ్బండ వర్గాల ప్రజల మేలు కోసం ఆయన నిర్మించిన పోరాటాలు కమ్యూనిస్టు ఉద్యమానికి మైలురాయిగా మిగిలాయని చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజాపోరాటల చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని, ఇది ముందు తరానికి స్పూర్తి దాయకంగా నిలుస్తుందని చెప్పారు. ప్రజలకష్టాలను స్వయంగా తెలుసుకుని వారిని సమీకరించి ఉద్యమాలు నిర్మించారన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి ప్రత్యేకమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పేదలు గిరిజనులు కార్మిక సమస్యలపై ఐఖ్యంగా ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. టివిఆర్ చంద్రం చూపిన ప్రజా ఉద్యమ పోరాటాన్ని నేటితరం కొనసాగించడమే ఆయనకిచ్చే నిజ నిజమైన నివాళి అని షాబీర్ పాషా అన్నారు. సిపిబ ఖమ్మం జిల్లాకార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం నాయకులు బి వెంకట్, బండారు రవికుమార్, ఎలమంచిలి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ