తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్పొరేషన్ ఆఫీసును ప్రజలు గుర్తుపట్టే విధంగా ప్రహరీ గోడను ఎత్తుగా నిర్మాణం చేసి దానిపై పరిశుభ్రత, ప్రభుత్వ పథకాల బొమ్మలను వేసి సుందరంగా తీర్చిదిద్దాలని మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు ప్రజావాణిలో కమిషనర్, మేయర్ గార్లకు వినతి పత్రాన్ని అందించారు. బుధవారం కార్పొరేషన్ ఆఫీసులో వినతిపత్రాన్ని అందించిన అనంతరం మునిగడప మాట్లాడుతూ కార్పోరేషన్ పరిధిలోని సుధీర ప్రాంతాల నుండి వారి అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలకి కార్పొరేషన్ ఆఫీస్ ను గుర్తు పట్టక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు ఈ సమస్యతో పాటుగా కోతులు, కుక్కలు, పందుల సమస్య విపరీతంగా ఉందని కోతులు, కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని అన్నారు అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పందుల సంచారాన్ని నివారించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ