తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీ కేంద్రాలను పరిరక్షిస్తూ "సేవ్ ICDS – సేవ్ అంగన్వాడీ సెంటర్స్" నినాదంతో, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (AITUC) ఆధ్వర్యంలో జూలై 12, 13 తేదీలలో భద్రాచలం నుండి కొత్తగూడెం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ , అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ch సీతా మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కు రూ.18,000 వేతనం అమలు చేయాలనే హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ ఉద్యోగులపై విధిస్తున్న BLO డ్యూటీతో పాటు ఇతర అదనపు పనులను రద్దు చేయాలని, ఫ్రీ ప్రైమరీ సెంటర్లను ఉపసంహరించుకోవాలని, రూ.1 కోటి ప్రమాద బీమా, హెల్త్ కార్డు, PF సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పాదయాత్రను ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.కె. సాబీర్ పాషా మరియు కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ ప్రారంభిస్తారని తెలిపారు. పాదయాత్ర ప్రారంభ సందర్భంగా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు k జమలయ్య. నాయకులు వేల్పుల మల్లికార్జున్, జిల్లా అధ్యక్షులు గోనే మణి. రెడ్డి అరుణ. సంధ్య. పాయం లత. చిన్నారి. శోభరాణి. అనిత. పార్వతి. శ్రీదేవి. సరోజా. కమల. తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ