తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం విలేఖరుల వినూత్న సెల్యూట్ వీఐపీ సంస్కృతికి భిన్నంగా.. దేశ రక్షకుడికి గౌరవం... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం విలేఖరులు ప్రత్యేక సందేశాన్ని చాటిచెప్పారు. ఆగస్టు 15న కొత్తగూడెం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జాతీయ పతాక కార్యక్రమంలో పలు కీలక సైనిక ఆపరేషన్లతో పాటు అబ్దుల్ కలాంకు పర్సనల్ టీంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి మెరైన్ కమాండ్ ఫోర్సుకు చెందిన కొత్తగూడెం బిడ్డ వేముల సతీష్ కుమార్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మెరైన్ కమాండ్ ఫోర్సులో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా అందులో మన కొత్తగూడెం జిల్లా నుంచి ఏకైక వ్యక్తి సతీష్ కావడం మన గర్వకారణం. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడిని స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించడం కొత్తగూడెం ప్రెస్ క్లబ్బులో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా వీఐపీలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలకు భిన్నంగా, దేశం కోసం సేవ చేసిన సైనికుడికి గౌరవం ఇవ్వాలనే నిర్ణయాన్ని విలేఖరులు తీసుకున్నారు. సైనికుడి చేతిలో జెండా.. బలమైన సందేశం.... స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు నిరంతరం సేవలందిస్తున్నారు. అలాంటి సైనికుడి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయించడం ద్వారా ఆయన సేవలకు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన నిర్వహించి, దేశ రక్షణలో సేవలందించిన సైనికులకు, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ రిపోర్టర్లు మోటమర్రి రామకృష్ణ, లోగాని శ్రీనివాస్, వెలుగు స్టాఫ్ రిపోర్టర్ పోతు రాజేందర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ గోవింద్, జనం సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఇమంది ఉదయ్ కుమార్, తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ అఫ్జల్ పఠాన్, విలేకరులు ఎర్ర ఈశ్వర్, జునుమాల రమేష్, కృష్ణారావు, కలాం, కృష్ణంరాజు, సురేష్వంత్ పండుగ , రామకృష్ణ ,దశరథ్ రజువా, ప్రభాకర్ రెడ్డి, రాజేష్, హుస్సేన్, చాంద్, లింగయ్య, జంపన్న ఇంకా ఏమైనా పేర్లు యాడ్ చేయగలను ఉంటే యాడ్ చేయగలరు
Admin
తెలుగు వెలుగు టీవీ