Thursday, 14 May 2026 01:03:28 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి: ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా.

Date : 09 October 2025 06:41 PM Views : 231

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా:సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం: గెరిల్లా పోరాట యోధుడు, ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా అని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కార్యదర్శి ఎస్ కే, ఫహీమ్ దాదా అన్నారు. చేగువేరా 58వ వర్ధంతిని ఏఐవైఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో శేషగిరి భవన్లో ఏర్పాటుచేసిన చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని... మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలన్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వారిని విప్లవోద్యమం వైపు మళ్ళించకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం అసాధ్యమని చే అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనే రెండు పట్టాలమీద విప్లవమనే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, తడిమట్టి ముద్ద, మార్క్సిజం మౌళిక భావనలు రెండూ ఒక్కటే అన్నారు. కుమ్మరి కళాకారుని చేతుల్లో ఆ చక్రం మీద మనిషి అవసరం కోసం వివిధ ఆకృతుల్ని రూపొందించినట్లుగా ఆయా సమాజాల భౌతిక పరిస్థితుల్ని బట్టి మార్క్సిజాన్ని అన్వయించుకోవచ్చన్నారు.ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా అంతిమంగా ప్రజల విముక్తే విప్లవకారుడి ధ్యేయం కావాలన్నారు.విత్తు నాటే ముందు వాన కురవాలి... పిడుగు పడే ముందు ఉరుము గర్జించాలి... ఒక విప్లవానికి ముందు త్యాగాలు జరిగి తీరాలని చే వ్యాఖ్యలు అనేక పోరాటాలకు అద్దం పడుతుందన్నారు. క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని, ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుమ్, భూపేష్, జావీద్, కొచ్చెర్ల రాకేష్,రణధీర్, ఇర్ఫాన్, నాదీమ్, అజయ్,రవి, విజయ్ కాంత్, త్రినేష్, షారుఖ్, సోహెల్, సంతోష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :